హైదరాబాద్: మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కేసు ఎదుర్కొంటున్న సంజుష్ (జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు) స్పందించారు. ఈ ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా, సంజుష్ తన వైపు వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలోని ముఖ్య అంశాలు:
-
తక్షణ సహాయం అందించా: ప్రమాదం జరిగిన వెంటనే తాను ఘటనా స్థలం నుంచి పారిపోలేదని, తీవ్రంగా గాయపడిన భారతి ముఖిని కాపాడేందుకు తన సొంత వాహనంలోనే ఆసుపత్రికి తరలించానని సంజుష్ తెలిపారు. దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
-
స్వయంగా పోలీస్ స్టేషన్కు: ఆసుపత్రికి తీసుకెళ్లిన అనంతరం తానే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన వివరాలను అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తున్నానని పేర్కొన్నారు.
-
వైద్య పరీక్షల్లో ‘నెగెటివ్’: ప్రమాద సమయంలో తాను మద్యం లేదా మరే ఇతర మత్తు పదార్థాలు సేవించలేదని స్పష్టం చేశారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్, యూరిన్ మరియు బ్లడ్ పరీక్షల నివేదికలన్నీ ‘నెగెటివ్’గా వచ్చాయని వెల్లడించారు.
-
సానుభూతి ప్రకటన: భారతి ముఖి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితురాలి కుటుంబానికి తన వంతు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
-
చట్టంపై నమ్మకం: ప్రమాదానికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలను, సిసిటివి (CCTV) ఫుటేజ్ మరియు వైద్య నివేదికలను నిష్పక్షపాతంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మన చట్ట, న్యాయ వ్యవస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తు ద్వారా నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.