Month: October 2021
షాకింగ్ సర్వే: ప్రజాగ్రహంలో కేసీఆర్ నెం. 1
హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నట్టుగానే ఉంది. తాజాగా విడుదలైన ఒక సర్వే సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిపాలన సూచీ మీద ఐఏఎన్ఎస్ – సీ ఓటర్ సర్వే నిర్వహించి విడుదల చేసింది. ఇందులో వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందన్న అంశం మీద సర్వే నిర్వహించారు. దీని ఫలితాలు షాకింగ్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో తమకు తిరుగులేదన్న మాటను పదే పదే […]
Continue ReadingEditorial: ఇండియలో టాప్ గేర్ వేసిన క్రిప్టో కరెన్సీ
ఎడిటోరియల్: ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని అధికారికం చేయగా.. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమే. భారత్లోనూ 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆర్బీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. మరోవైపు దేశంలో క్రిప్టో కరెన్సీని ఆమోదించేందుకు కేంద్రం ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ’ బిల్లును సిద్ధం చేస్తోంది. ఈ […]
Continue Readingమావోయిస్టు RK స్థానాన్ని భర్తీ చేసేది అతడేనా..?
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణంతో కీలకమైన ఏఓబీ పరిధిలో ఓ పట్టున్న నేతను పార్టీ కోల్పోయింది. ఆర్కే మరణంతో మళ్లీ ఏవోబీలో సందిగ్ధత నెలకొంది. ఆర్కే స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఏవోబీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే నేత ఎవరు? అన్న చర్చ సాగుతోంది. ఈ అంశంపై పోలీసువర్గాలు కూడా ఒకింత ఆసక్తిని కనబరుస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి దండకారణ్యంతోపాటు ఏవోబీ కూడా కీలకమైనది. నల్లమల, దండకారణ్యం, జంగల్ మహాల్తో […]
Continue Readingసాగు చట్టాలకు వ్యతిరేకంగా పట్టాలెక్కిన రైతులు.. రైల్రోకోతో ఉద్యమం మరింత ఉధృతం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత ఉధృతమైంది. యూపీలోని లఖీంపూర్ హింసాకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా రైల్రోకో చేపట్టారు రైతులు. రైల్వేట్రాక్లపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలు చేపట్టిన రైల్రోకోతో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఇప్పటికే ఆశిష్ మిశ్రాను పోలీసులు […]
Continue Readingసర్వే: 2024 ఎన్నికల్లో ప్రధానిగా ఎవరిని కోరుకుంటారు?
PRIME TODAY సర్వే ఫలితాలు:2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా? బీజేపీ సారధ్యంలోని నరేంద్ర మోడీ పాలనకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? […]
Continue ReadingRK No More..! ఒక శకం ముగిసింది. దండకారణ్యం చిన్నబోయింది.! మరి నెక్ట్స్ ఎవరు? మావో కేంద్ర కమిటీలో మిగిలిందెందరు?
ఆర్కే నో మోర్..! ఒక శకం ముగిసింది. మరి నెక్ట్స్ ఎవరు? ఇక మావోయిస్టుల పతనం మొదలైనట్లేనా? నక్సలిజానికి కాలం చెల్లినట్లేనా? అడవిలో నడిపించే నాయకుడే కరువయ్యాడా? కేంద్ర కమిటీలో ఉన్నది ఎందరు? మిగిలింది ఎందరు? మావోయిస్ట్ ఆపరేషన్స్లో సెంట్రల్ కమిటీదే కీ రోల్. డెసిషన్స్ తీసుకోవాలన్నా …వాటిని అమల్లో పెట్టాలన్నా అంతా అక్కడి నుంచే.! అలాంటి సెంట్రల్ కమిటీ ఇప్పుడు కెప్టెన్ లేని టీమ్గా మారిందా? ఆర్కే తర్వాత మళ్లీ ఆ స్థాయి నేత లేడా? […]
Continue Readingఇదేనా సమాజాన్ని ఉద్దరించే మీడియా?
కుక్క అరిస్తే.. వార్త.. పిల్లి కనిపిస్తే.. సంచలనం.. అన్నట్టుగా వ్యవహరించే తెలుగు మీడియా.. ఏ చిన్న సంఘటన జరిగినా.. అరిచి గగ్గోలు పెట్టే తెలుగు మీడియా.. అత్యంత సంచలనం సృష్టించిన హెటిరో డబ్బు కట్టల ఉదంతంలో మాత్రం మూతికి సీలేసుకుందా! అన్నట్టుగా వ్యవహరించడం.. అన్ని వర్గాలను విస్మయానికి గురి చేసింది. నిజానికి ఇటీవల వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన వార్తలు ఇంతలింతలు చేసి ప్రచారం చేశారు. ఆ టీవీ ఈటీవీ అనే తేడా లేకుండా.. […]
Continue Readingఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు .. ఈటెల సంచలన వ్యాఖ్యలు !
హుజూరాబాద్ బై పోల్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ లో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజీనామా చేయి బీజేపీ తరపున మళ్లీ పోటీ చేస్తుండటం తో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ స్థానం నుండి టిఆర్ ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. టిఆర్ ఎస్ నుండి అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ ఎస్ సీటు గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల […]
Continue Readingకీలక నిర్ణయం ప్రకటించిన సోనియాగాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఇన్నాళ్లు కొనసాగిన సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి సమయం అధ్యక్షురాలిగా ఉంటానని పేర్కొన్నారు. ఇన్ని రోజులు సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. కానీ ఎక్కడా కూడా ఆమె పూర్తి సమయం అధ్యక్షురాలిగా పనిచేయలేదు. లఖింపూర్ ఖేరీ హింస నుంచి గత కొన్ని […]
Continue Reading